కుతూహలమ్మ మనస్సాక్షికి తెలుసు: టిడిపి

శాసనసభ వ్యవహారాల్లో స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి సభకు వచ్చి వివరణ ఇవ్వాలని తాము పట్టుబట్టామని, ఇదే విషయాన్ని ఛేంబర్ కు వెళ్లి స్పీకరుకు కూడా చెప్పామని, స్పీకర్ నోరు విప్పలేదని ఆయన చెప్పారు. స్పీకరు కె.ఆర్. సురేష్ రెడ్డి సభకు రావాలనేదే తమ ఉద్దేశం తప్ప కుతూహలమ్మపై తాము వ్యతిరేకత ప్రదర్శించలేదని, ఈ విషయాన్ని సంఘటననుంచి వేరు కాంగ్రెస్ వారు వక్రీకరించారని ఆయన అన్నారు. దళితులపై కాంగ్రెసుకు గౌరవం ఉంటే కుతూహలమ్మను స్పీకరును చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విషయాన్ని కుతూహలమ్మ విజ్ఞతకే వదిలేస్తున్నామని, ఏం జరిగిందనేది కుతూహలమ్మ మనస్సాక్షికి తెలుసునని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications