కరీంనగర్: కరీంనగర్ లోక్ సభ స్ధానానికి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధిగా ఆ పార్టీ అధినేత చంద్రశేఖరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎటువంటి ఆర్భాటం లేకుండా ఆయన ఏకైక వాహనం మీద బయలుదేరి వెళ్ళి నామినేషన్ సమర్పించారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయానికి వెళ్ళి పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు.