తెలుగువారి ఆత్మగౌరవానికి దెబ్బ: బాబు

గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి జరిపిన పాదయాత్రకు, తన యాత్రకు మధ్య తేడా ఉందని ఆయన చెప్పారు. తన యాత్ర దేశ ఆర్థిక పరిస్థితిని మార్చేందుకు సాగుతోందని ఆయన చెప్పారు. కాంగ్రెస్,తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) దొంగాట ఆడుతున్నాయని ఆయన విమర్శించారు. ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. అక్కడి నుంచే ఆయన ఒక ప్రైవేట్ టీవీ చానెల్ జూనియర్ ఎన్టీఆర్ తో నిర్వహించిన లైవ్ షోలో కూడా ఆయన మాట్లాడారు. రైతుల ప్రభుత్వమని చెప్పి కాంగ్రెస్ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని ఆయన విమర్శించారు. తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఇప్పుడు రాష్ట్రంలో ఆదాయం పెరిగిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
