వైయస్ ప్రభుత్వంపై టిడిపి చార్జీషీట్

పునరంకిత సభ ఎందుకు జరుపుతున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. అవినీతికి వైయస్ ప్రభుత్వం పునరంకితమైందని ఆనయ వ్యాఖ్యానించారు. ఒక్క పులివెందులకే ముఖ్యమంత్రి 8.5 వేల కోట్ల రూపాయలు వెచ్చించారని, ముఖ్యమంత్రికి పులివెందుల తప్ప ఇతర ప్రాంతాలు కనిపించడం లేదని ఆయన అన్నారు. బంధుప్రీతి, ప్రాంతీయ విద్వేషాలతో కాంగ్రెసు ప్రభుత్వం కుళ్లిపోయిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications