హామీలపై శ్వేతపత్రానికి బాబు డిమాండ్

ప్రజాసమస్యలపై కెసిఆర్ ఒక ఉద్యమం కూడా చేపట్టలేదని ఆయన చంద్రబాబు విమర్శించారు. బీడీ కార్మికుల సమస్యపై తెరాస పోరాటం చేయలేదని, అందువల్ల తెరాసకు ఎందుకు ఓటు వేయాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ గృహాలు దగా అని, అవి కాంగ్రెసు గృహాలు అని ఆయన అన్నారు. ధరల నియంత్రణ తెలుగుదేశం పార్టీకే సాధ్యమని ఆయన అన్నారు. రేషన్ కార్డుపై తన ఫొటో పెట్టుకుని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి రెండు రూపాయలకు కిలో బియ్యం పథకంతో పండుగ చేసుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వస్తే గృహాలకు ఉచితంగా 50 యూనిట్ల విద్యుత్తును సరఫరా చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
