తెరాసపై నమ్మకం పోయింది: బాబు

Chandrababu Naidu
సిద్ధిపేట: తెలంగాణలో కాంగ్రెస్ పై ప్రజలకు కోపం ఉందని, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)పై నమ్మకం పోయిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. అది తమ పార్టీకి అనుకూలంగా మారుతుందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. తెలంగాణలో తమకు అనుకూలంగా అనూహ్య స్పందన లభిస్తోందని ఆయన అన్నారు. తెలంగాణలో వెనకబాటుతనం ఉందని, అభివృద్ధి జరగలేదని, ఏదైనా అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగిందనే అభిప్రాయం ప్రజల్లో ఉందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చెబుతున్న అభివృద్ధి అంతా బూటకమని ఆయన విమర్శించారు.

తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు తెలంగాణవాదం ఓడిపోతుందని ఊహా చిత్రం గీస్తున్నారని, ప్రజా సమస్యలపై పని చేయడం లేదని, తెరాస ప్రజా సమస్యలపై పోరాడలేదని ఆయన అన్నారు. ప్రాజెక్టుల పేరు మీద ప్రభుత్వ పెద్దలు అవినీతికి పాల్పడుతున్నారని, సంపదను ముఖ్యమంత్రి హస్తగతం చేస్తున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని, ఈ విషయంలో అన్నీ చర్చిస్తామని ఆయన అన్నారు. తాము మాటకు కట్టుబడి ఉంటామనే విశ్వసనీయతను ప్రజల్లో సంపాదించుకున్నామని ఆయన చెప్పారు. చంద్రశేఖరరావు ఎందుకు రాజీనామా చేయించారని, ఆత్మరక్షణ కోసం చంద్రశేఖరరావు తమపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రశేఖరరావు, రాజశేఖరరెడ్డి కలిసి ఆడుతున్న నాటకాన్ని బయటపెడతామని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+