చట్టబద్ద పాలన కరువు: జెపి

Jayaprakash Narayanan
హైదరాబాద్: రాష్ట్రంలో చట్టబద్ద పాలన కరువైందని లోకసత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ విమర్శించారు. శుక్రవారం మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజలను రాజకీయ పార్టీ బిచ్చగాళ్లుగా మారుస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. పేదరికాన్ని శాశ్వతంగా కాపాడాలనే ఉద్దేశంతోనే అవి పని చేస్తున్నాయని, పేదరిక నిర్మూలన జరిగితే ప్రజలు తమ మాట వినరని భయమని ఆయన అన్నారు. అందుకే రెండు రూపాయలకు కిలో బియ్యం, నిరుద్యోగ భృతి, పావలా వడ్డీకే రుణాలు వంటి హామీలను రాజకీయ పార్టీలు ఇస్తున్నాయని ఆయన అన్నారు.

రాజకీయాలను సమూలంగా ప్రక్షాళన చేయడమే తమ ఉద్దేశ్యమని ఆయన చెప్పారు. చట్టం ఉన్నవారి చుట్టంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. అయేషా హత్యను, అజీజ్ రెడ్డి, రామ్మోహన్ ల కాల్చివేతలను ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. కుల, మత, ప్రాంత విద్వేషాలకు రాజకీయ పార్టీలు ఆజ్యం పోస్తున్నాయని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+