ఢిల్లీలో ఆత్మగౌరవం తాకట్టు: హరికృష్ణ

Harikrishna
విజయవాడ: తనను ఇంతవాడిని చేసిన రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో స్వర్గీయ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ అన్నారు. చెప్పిన మాట నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్కటేనని ఆయన అన్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో బుధవారం ఏర్పాటైన స్వర్గీయ ఎన్టీరామారావు జయంతి సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం ఐటికి ఎంతో ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మనకు విదేశాల్లో ఆదరణ పెరిగిందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని ఆయన విమర్శించారు.

ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రజలను విస్మరించారని ఆయన అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని, అదే సమయంలో ప్రతి వస్తువు ధర పెరిగిందని ఆయన అన్నారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయని, దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. కల్లబొల్లి కబుర్లు చెప్పితే ప్రజలు కాంగ్రెసును నమ్మారని, అయితే ప్రజల పాలిటి దౌర్భాగ్యంగా అది మారిందని ఆయన అన్నారు. వనరులను తెలుగుదేశం ప్రభుత్వం పెంచిందని, వాటి ఫలాలను కాంగ్రెసు ప్రజలకు అందించడంలో విఫలమైందని ఆయన అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని మళ్లీ ఇవాళ ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్నారని ఆయన విమర్శించారు. షంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరును తొలగించడాన్ని ఆయన తప్పు పట్టారు. ఎయిమ్స్ డైరెక్టర్ వేణుగోపాల్ ను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించిందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం కల్పించాలని ఆయన కోరారు. తెలుగుదేశం నాయకులు యనమల రామకృష్ణుడు, లాల్ జాన్ పాషా తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+