బిజెపి చేరువకు బాబు: వైయస్

తాము చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు తమ పట్ల సానుకూలంగా ఉన్నారని, ప్రభుత్వంపై ఇంత సానుకూల వైఖరిని తాను చూడలేదని ఆయన అన్నారు. అభివృద్ధి వల్ల ప్రజలకు తమపై వ్యతిరేకత లేదని ఆయన అన్నారు. తమకు అభివృద్ధి పట్ల చిత్తుశుద్ధి ఉందని ఆయన చెప్పారు. రైతులకు ఉచిత కరెంట్, రుణాల మాఫీ వంటి కార్యక్రమాల వల్ల ప్రజలు తమ పట్ల సానుకూలంగా ఉన్నారని ఆయన చెప్పారు. మరో రెండు నెలల్లో అర్హులైనవారందరికీ రేషన్ కార్డులిస్తామని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల్లో తెలంగాణలో మూడు నెలల పాటు అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
