ఆంధ్రజ్యోతి కథనం తప్పే: వైయస్

YS Rajasekhar Reddy
హైదరాబాద్: కుల ఉద్యమాల నేతలపై బాడుగ నేతలు అనే వార్తా కథనాన్ని ఆంధ్రజ్యోతి రాయడం తప్పేనని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. ఆ వార్తా కథనం అభ్యంతరకరంగా ఉందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఎవరి మనోభావాలను కూడా పత్రికలు అవమాన పరచకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. పత్రికలకు స్వయం నియంత్రణ అవసరమని ఆయన అన్నారు.

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) కార్యకర్తలు ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడి చేయడం తప్పేనని ఆయన అన్నారు. ఎమ్మార్పీయస్ ప్రజాస్వామిక పద్ధతుల్లో స్పందించాలని ఆయన సూచించారు. కుల ఉద్యమాల నేతలు ప్రభుత్వానికి అమ్ముడుపోతున్నారనే వార్తాకథనంపై ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను కుల ఉద్యమాల నేతలు సమర్థిస్తున్నారు కాబట్టే, ప్రభుత్వాన్ని ఎవరూ విమర్శించడం లేదు కాబట్టే ఆంధ్రజ్యోతి వారు కక్ష పెంచుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల్లో తెరాస ఓడినా తెలంగాణ వాదం బలహీనపడదని ఆయన అన్నారు.

పేదలందరికీ ఉచితంగా ఇళ్లు కట్టిస్తామని, బాకీలు మాఫీ చేయిస్తామని ఆయన చెప్పారు. రైతులకు నాణ్యమైన కరెంటును 12 గంటల పాటు పగటి పూటే ఉచితంగా ఇస్తామని ఆయన చెప్పారు. చదువుకున్న యువకులందరికీ వేయి రూపాయలేసి నిరుద్యోగ భృతి ఇప్పిస్తామని ఆయన చెప్పారు. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పిస్తామని ఆయన చెప్పారు. చంద్రబాబు ఈ సభలో హామీల వర్షం కురిపించారు. ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెసు ప్రభుత్వం ముస్లింలను మోసం చేసిందని ఆయన విమర్శించారు. వాకిరి రిజర్వేషన్లు కల్పించే బాధ్యత తీసుకుంటామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+