నాంపల్లి కోర్టుకు హాజరైన కెవిపి
హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు, ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అనుంగు మిత్రుడు కెవిపి రామచందర్ రావు సోమవారంనాడు హైదరాబాదులోని నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు డాక్టర్ కోడెల శివప్రసాదరావుపై వేసిన పరుపు నష్టం దావా విషయంలో ఆయన కోర్టుకు వచ్చారు. ఈ కేసులో కెవిపి రామచందర్ రావు వాదనను కోర్టు రికార్డు చేసుకుంది.
కేసు విచారణ ఈ నెల 17వ తేదీకి వాయిదా పడింది. కెవిపి రామచందర్ రావు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ కోడెల శివప్రసాదరావు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై కెవిపి రామచందర్ రావు శివప్రసాదరావు మీద పరువు నష్టం దావా వేశారు.












Click it and Unblock the Notifications