కూలీల కొడుక్కు ఐఐటి ర్యాంక్

ఐఐటి జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో ఇంత మంచి ర్యాంకు సాధించిన మాగంటి నర్సింహ పరిస్థితి గురించి టీవీలో చూశానని, అతని చదువు ఆగిపోకూడదని అప్పుడే అనిపించిందని కోకరెంట్ సంస్థ సిఇఒ కె. సుధీర్ బాబు అన్నారు. అతన్ని తాను పిలిచి తాము ఫీజు చెల్లిస్తే చదువుతావా అని అడిగామని, తాను సరేనన్నాడని, దాంతో తాము అతన్ని చదువు ఖర్చులు భరించడానికి సిద్ధపడ్డామని ఆయన వివరించారు. నర్సింహ ఏడో తరగతి వరకు తన సొంత గ్రామంలో చదివాడు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆశ్రమ పాఠశాలలో చదివాడు. ఒక రాజకీయ నాయకుడి సాయంతో విజయవాడ నారాయణ కాలేజీలో చదివి ఇంటర్ లో 93 శాతం మార్కులు సాధించాడు. తమకు అందిన సహాయం పట్ల నర్సింహ తండ్రి అప్పయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. తన కృషికి తగిన ఫలితం లభించిందని నర్సింహ అంటున్నాడు.












Click it and Unblock the Notifications