ప్రజాభీష్టం మేరకు నిర్ణయం: బాబు

సమావేశంలో విధివిధానాలపై కన్నా సమగ్ర చర్చకే ప్రాధాన్యం ఇచ్చామని ఆయన చెప్పారు. మూడు గంటల పాటు తెలంగాణపై, పార్టీ పరిణామాలపై చర్చించామని ఆయన చెప్పారు. పార్టీ అంతర్గత విషయాలపై కూడా చర్చించామని ఆయన చెప్పారు. తెలంగాణ అంశం రాష్ట్రానికి సంబంధించిందని, అన్ని వైపుల నుంచి అభిప్రాయాలను తీసుకుంటామని ఆయన చెప్పారు. మీడియా ఊహించి వార్తలు రాస్తోందని ఆయన చెప్పారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి కాలపరిమితేమీ లేదని ఆయన చెప్పారు. తెలంగాణపై ఊహాగానాలు వద్దని, అన్నీ తామే చెప్తామని ఆయన మీడియానుద్దేశించి అన్నారు. తెలంగాణ చాలా సున్నితమైన అంశమని, మీడియా కూడా బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
తెలంగాణ విషయంలో కాంగ్రెస్ ఊసరవెల్లి రాజకీయాలు చేస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణకు కాంగ్రెసే ద్రోహం చేసిందని ఆయన అన్నారు. తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయంగా వాడుకున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. తాము నోటీసులు ఇచ్చిన తర్వాత పార్టీ నాయకులెవరూ బహిరంగ ప్రకటనలు చేయవద్దని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications
