ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఈ రోజు డిల్లీ బయిలు దేరి వెళ్ళారు. ఉప ఎన్నికల అనంతరం తొలిసారిగా ఢిల్లీ వెళుతున్న ఆయన తన పర్యటనలో పార్టీ అథ్యక్షురాలు సోనియాగాంధీ,ప్రధాని మన్మోహన్ సింగ్ తో సహా పలువురు కేంద్ర మంత్రిలను కలువనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ తాజా పరిస్ధితిపై ఆయన అధిష్టానానికి నివేదిక సమర్పించే అవకాశం ఉంది. అనంతరం తెలుగు భాషకు ప్రాచీన హోదా,ఎరువులు,బియ్యం అదనపు కోటాతో పాటు వరికి వేయి రూపాయల మద్దతు ధర విషయమే ఆయన కేంద్రానికి విన్నవిస్తారు. మంత్రి వర్గ విస్తరణ,మహిళా కాంగ్రెస్ అధ్యక్షరాలి నియామకం గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. వరికి మధద్దతు ధర విషయమై వ్యవసాయ మంత్రి శరద్ పవార్ తో చర్చిస్తారు. ఆర్ధిక మంత్రి చిదంబరంతో కూడా భేటీ అవతారు. ప్రధానితో ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడతారు.