3న యుఎన్ పిఎ సమావేశం: బాబు

Chandrababu Naidu
హైదరాబాద్: దేశ తాజా రాజకీయాలపై జులై 3వ తేదీన యుఎన్ పిఎ చర్చిస్తుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చెప్పారు. యుపిఎ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు యుఎన్ పిఎ భాగస్వామ్య పార్టీ సమావాజ్ వాదీ మద్దతు ఇవ్వడానికి సిద్ధపడుతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతోంది. యుఎన్ పిఎ భాగస్వామ్య పార్టీ అయిన తెలుగుదేశం కాంగ్రెసుకు బద్ధ విరోధి. ఈ స్థితిలో యుఎన్ పిఎ సమావేశం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోననే ఉత్కంఠ నెలకొంది.

లోకసభకు ముందస్తు ఎన్నికలు రాకపోతే తన మీకోసం యాత్ర 150 రోజులు కొనసాగుతుందని చంద్రబాబు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల సామాన్యుడి నడ్డి విరుగుతోందని ఆయన విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్ల సమస్యపై ఆయన ప్రజలను ఆరా తీశారు. ఉత్తరాంధ్రలోని ఆరు శాసనసభా నియోజకవర్గాలకు ఆయన అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. ఎచ్చర్లకు కళా వెంకట్రావు, అముదాలవలసకు తమ్మినేని సీతారాం, రాజాంకు ప్రతిభా భారతి, నర్సన్నపేటకు లక్ష్మణరావు, పాలకొండకు నిమ్మక గోపాలరావు, పాతపట్నానికి మోహన్ రావు పేర్లను ఖరారు చేశారు. ఈ పేర్లను చంద్రబాబు అధికారికంగా ప్రకటిస్తారు. మరో నియోజకవర్గాన్ని చూసుకోవాల్సిందిగా సోంపేట శాసనభ్యుడు శివాజీకి చంద్రబాబు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+