మమ్మల్లి మోసం చేసింది: కారత్

అణు ఒప్పందంపై ప్రభుత్వం పారదర్శకంగా లేదని ఆయన అన్నారు. ఒప్పందానికి సంబంధించిన అంశాలను ప్రజలకు వివరించాలని ఆనయ డిమాండ్ చేశారు. ప్రభుత్వం చూపంతా అమెరికా వైపే ఉందని, బుష్ కోరికలు తీర్చే రాజకీయ పక్షంగా తాము ఉండదలుచుకోలేదని ఆయన అన్నారు. అణు ఒప్పందం ముసాయిదాను ప్రభుత్వం దాచి పెట్టిందని ఆనయ విమర్శించారు. ప్రభుత్వ దృష్టంతా అణు ఒప్పందంపైనే ఉందని, ధరలను నియంత్రించాలనే ఆలోచన లేదని ఆయన విమర్శించారు. లోకసభ స్పీకర్ సోమనాధ్ ఛటర్జీ విషయంపై మాట్లాడబోమని, కొనసాగాలా రాజీనామా చేయాలా అనే విషయాన్ని ఛటర్జీ నిర్ణయించుకుంటారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
