దేవేందర్ ది నవ తెలంగాణ ప్రజా పార్టీ

ఆత్మాభిమానం చంపుకోలేకనే పార్టీని స్థాపిస్తున్నట్లు దేవేందర్ చెప్పారు. పార్టీ పెట్టే విషయంలో తనకు పార్టీలకు అతీతంగా సూచనలు వచ్చాయని ఆయన చెప్పారు. తాను మేధావుల నుంచి సూచనలు తీసుకుంటూనే ఉంటానని ఆయన అన్నారు. తెలంగాణలో జీవనదులున్నా నీరు అందకుండా పోయిందని ఆయన అన్నారు. తెలంగాణ సాధనలో తనకు సహకరించాలని ఆయన కోరారు. ఆంధ్రా మిత్రులు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని, అన్నదమ్ముల్లాగా విడిపోయి రెండు ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందామని ఆయన అన్నారు. రెండు ప్రాంతాల్లోనూ పేదలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
