న్యూ డిల్లీ :అణుఒప్పందం విషయంలో యూపీఏ సర్కారు వైఖరిని భారతీయ జనతా పార్టీ తప్పుపట్టింది. దేశ భద్రతకు, భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో ఏకాభిప్రాయంతోనే ముందుకెళతామన్న ప్రధాని నయవంచన చేశారని బీజేపీ సీనియర్ నేత, విదేశాంగ శాఖ మాజీమంత్రి యశ్వంత్ సిన్హా ఘటుగా విమర్శించారు. భారత్ - అమెరికా అణు ఒప్పందం మీద ప్రధాని మన్మోహన్ సింగ్ ఏకాభిప్రాయ సాధనకు కృషి చేయడం లేదని ఆయన విమర్శించారు. అలాగే అటు పార్లమెంట్ విశ్వాసాన్ని, ఇటు ప్రజల విశ్వాసాన్ని గమనంలోకి తీసుకోకుండా మన్మోహన్ సర్కారు రాజకీయ అస్థిరతను పెంచిపోషిస్తోందని బీజేపీ ధ్వజమెత్తింది. మరోవైపు కాంగ్రెస్ లెఫ్ట్ మీద ధ్వజమెత్తింది. మరోవంక వామపక్షాల మద్దతు ఉపసంహరణను కాంగ్రెస్ జీర్ణించుకోలేక పోతోంది.