డర్బన్: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మంగళవారం మహాత్మా గాంధీ అంతర్జాతీయ శాంతి బహుమతిని అందుకున్నారు. తన సేవలు, త్యాగాలతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది హృదయాలకు చేరువ అయిన నెల్సన్ మండేలా తరపున ఆయన సన్నిహితుడు, రాజకీయ సలహాదారు అహ్మద్ కథ్రాడా ఈ అవార్డును అందుకున్నారు. గత శుక్రవారం 90వ ఏట అడుగుపెట్టిన నెల్సన్ మండేలాకు డర్బన్కు చెందిన మహాత్మాగాంధీ డెవెలప్మెంట్ ట్రస్ట్, సత్యాగ్రహ సంస్థలు సంయుక్తంగా ఈ అవార్డును అందించాయి. నెల్సన్ మండేలా, అహ్మద్లతోపాటు చాలా ఏళ్లు జైలు జీవితం గడిపిన మరో మాజీ ఖైదీ బిల్లీ నాయర్ ఈ అవార్డును ప్రదానం చేశారు.