అమర్ నాద్ వివాదం: ప్రభుత్వం చర్చలు

భూమిని రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ అమర్నాథ్ యాత్ర సంఘర్షణ సమితి అధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి. అమరనాథ్ ఆమయానికి తిరిగి భూమి కేటాయించాలని ఆ సంస్థ బంద్లకు దిగింది. దీంతో కాశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం వారితో చర్చలు జరపాలని నిర్ణయించింది. మొదట్లో ససేమిరా అన్న సంఘర్షణ సమితి ఎట్టకేలకు చర్చలకు అంగీకరించింది. దీంతో హోం శాఖ ప్రధాన కార్యదర్శి అనిల్ గోస్వామి, రాష్ట్ర డీజీపీ కులదీప్ కోడాలను ప్రభుత్వ ప్రతినిధులుగా నియమించారు. వీరు దాదాపు 30 హిందూ గ్రూపుల నుంచి వారి వారి ప్రతిపాదనలను స్వీకరించారు.












Click it and Unblock the Notifications
