అహ్మదాబాద్ పేలుళ్ల సూత్రధారి రసూల్?
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ బాంబు పేలుళ్ల సూత్రధారిని నిఘా వర్గాలు గుర్తించినట్లు సమాచారం. ఈ పేలుళ్ల సూత్రధారిని రసూల్ ఖాన్ గా ఆ వర్గాలు అనుమానిస్తునట్లు తెలుస్తోంది. రసూల్ హుజీలో కీలక పాత్ర పోషించాడు. ఓ హత్య కేసులో కూడా అతను నిందితుడు. అతని కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.
గుజరాత్ మాజీ హోం మంత్రి హిరేన్ పాండ్యా హత్య కేసులో కూడా అతను నిందితుడు. వరుస బాంబు పేలుళ్లతో అహ్మదాబాద్ అట్టుడికిన విషయం తెలిసిందే. ఈ పేలుళ్లలో 49 మంది మరణించారు. అప్పటి నుంచి అనుమానితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తూనే ఉన్నారు.












Click it and Unblock the Notifications
