వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొక్కిసలాట మృతులు 146 మంది

By Staff
|
Google Oneindia TeluguNews

Naina Devi
బిలాస్ పూర్: హిమాచల్ ప్రదేశ్ లోని నైనాదేవి ఆలయం ఎప్పటి లాగే సోమవారం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం జరిగిన తొక్కిసలాటలో 146 మంది భక్తులు మరణించారు. దైవ దర్శనం కోసం భక్తులు ఆదివారం అర్థరాత్రి నుంచే క్యూలు కట్టడం మొదలు పెట్టారు. తాము దైవదర్శనం కోసం పంజాబ్ నుంచి వచ్చామని, తాము ప్రమాదం గురించి విన్నామని, అయితే దైవదర్శనం చేసుకునే విషయంలో తమ మనసు మారలేదని మంజిత్ కుమార్ అంటున్నారు. ముగ్గురు మిత్రులతో ఆయన నైనాదేవి ఆలయానికి వచ్చాడు.

ప్రమాదం దురదృష్టకరమని, అయితే దీనివల్ల భక్తుల సంఖ్య తగ్గలేదని ఆలయ పూజారి రాజేష్ కుమార్ అన్నారు. ప్రమాద బాధితుల చెప్పులు, స్లిప్పర్లు, ఇతర వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్నాయని, ఇవేవీ భక్తుల సంఖ్యను తగ్గించలేకపోయాయి. నైనా దేవీ ఆలయం హిమాచల్ ప్రదేశ్ లోని బిలాప్ పూర్ జిల్లాలో ఉంది. దేశంలోని 50 హిందూ శక్తి పీఠాల్లో ఇదొకటి. శ్రావణ నవరాత్రి సందర్భంగా ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X