వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కురుణానిధిపై సుప్రీం మండిపాటు
నిరుడు అక్టోబర్ మొదటి వారంలో తాను ఇచ్చిన నోటీసుకు ముఖ్యమంత్రితో పాటు మిగతావారు ప్రతిస్పందించకపోవడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. నోటీసుకు సమాధానం ఇవ్వడానికి తమిళనాడు ప్రభుత్వం పదే పదే గడువు కోరుతుండడం పట్ల కోర్టు విచారం వ్యక్తం చేసింది. సమాధానం ఇవ్వడానికి నాలుగు వారాల గడువు కావాలని తమిళనాడు ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 31వ తేదీన సుప్రీంకోర్టును కోరింది. అయినా తమిళనాడు ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు.
కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ నిరుడు అక్టోబర్ 1వ తేదీన సేతు సముద్రం వివాదంపై ముఖ్యమంత్రి కరుణానిధి నేతృత్వంలోని డిఎంకె రాష్ట్రవ్యాప్త బంద్ నిర్వహించింది. దీనిపై సుప్రీంకోర్టు కోర్టు ధిక్కారం కింద నోటీసులు జారీ చేసింది.
Comments
Story first published: Monday, August 4, 2008, 17:40 [IST]