చిరు అభిమానులపై కోర్టు వారంట్లు
హైదరాబాద్: సినీ నటుడు రాజశేఖర్ పై దాడి కేసులో మెగాస్టార్ చిరంజీవి అభిమానులపై నాన్ బెయిలెబుల్ అరెస్టు వారంట్లు జారీ అయ్యాయి. పది మంది చిరంజీవి అభిమానులకు ఈ వారంట్లు జారీ అయ్యాయి. ఆ మధ్య రాజశేఖర్, జీవిత దంపతులపై కొంత మంది హైదరాబాదులోని పంజగుట్ట ప్రాంతంలో దాడి చేసిన విషయం తెలిసిందే. కారులో ఇంటికి వెళ్తుండగా ఈ దాడి జరిగింది.
చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై చేసిన వ్యాఖ్యలకు ఆగ్రహించిన చిరంజీవి అభిమానులు రాజశేఖర్ పై ఆ దాడి చేశారు. అప్పటి నుంచి రాజశేఖర్ దంపతులు కాంగ్రెసుకు దగ్గర కావడమే కాకుండా ఇటీవల కాంగ్రెసు పార్టీలోనే చేరారు.












Click it and Unblock the Notifications
