మెగా వేదికపై చిరు ఫ్యాన్స్ గొడవ

Chiranjeevi
తిరుపతి: మెగాస్టార్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన వెంటనే ఆయన అభిమానుల్లో కూడా గ్రూపులు మొదలయ్యాయి. ఈ నెల 26వ తేదీన తలపెట్టిన చిరంజీవి బహిరంగ సభ వేదిక విషయంలో తిరుపతిలోని చిరంజీవి అభిమానుల్లో విభేదాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 26వ తేదీన తిరుచానూరులోని పద్మావతి ఆలయానికి సమీపంలో గల అవిలాల ట్యాంక్ వద్ద చిరంజీవి బహిరంగ సభకు అనుమతి కోరారు. దాదాపు 183 ఎకరాలున్న ఈ మైదానంలో ఐదారు లక్షల మంది పడుతారు. అయితే ఈ మైదానంలో ఉన్న పొదలను కొట్టేసి సరి చేయాల్సి ఉంటుందని జిల్లా అధికారులు బహిరంగ సభ నిర్వాహకులకు చెప్పారు. దీంతో మైదానాన్ని సరిచేసే పనులు సాగుతున్న సమయంలోనే మరో వేదికను చూసుకోవాలని జిల్లా అధికారులు నిర్వాహకులకు సూచించారు.

బహిరంగ సభ నిర్వహణకు అధికారులు తిరుచనూరులోనే ఉన్న నందికుంట వద్ద గల 40 ఎకరాల స్థలాన్ని చూపారు. ఇందులో మూడు, నాలుగు లక్షల మంది పడతారు. చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ ఈ రెండు స్థలాలను కూడా చూసి అవిలాల స్థలాన్ని ఎన్నిక చేసుకున్నట్లు సమాచారం. అయితే చిరంజీవి సోదరుదడు నాగబాబు బుధవారం చూసిన తర్వాత స్థలాన్ని ఎంపిక చేసుకోవాలని అనుకున్నారు. అయితే ఇంతలో చిరంజీవి అభిమానుల మధ్య విభేదాలు తలెత్తాయి. చిరంజీవి సేవాదళ్ కు చెందిన అశోక్ సామ్రాట్ అవిలాల ట్యాంక్ స్థలంలో బహిరంగ సభ నిర్వహణకు పట్టుబడుతుండగా, చిరంజీవి యువసేనకు చెందిన సి.ఆర్. రాజన్ నందికుంటలో సభ నిర్వహణను కోరుకుంటున్నారు. అయితే, వీరిద్దరు కూడా ప్రజలకు పెద్దగా తెలియదు. చిరంజీవి దృష్టిని ఆకర్షించడానికే వీరిద్దరూ ఈ విధమైన చర్యలకు పూనుకుంటున్నారనే వాదన వినిపిస్తున్నది. తమకంతా తెలుసునని, చిరంజీవి రక్షణ కోసం శిక్షణ పొందిన 2,500 మంది వాలంటీర్లను ఏర్పాటు చేశామని, ప్రజలు వేదికకు 100 అడుగుల దూరం నుంచే కూర్చోవడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చిరంజీవి విధేయులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+