వల్లూరులో కరీంనగర్ వాసుల మృతి
ఒంగోలు : ప్రకాశం జిల్లా వల్లూరు వద్ద ఆగివున్న లారీని ట్రాక్స్ ఢీకొట్టడంతో ఆదివారంనాడు నలుగురు మృతిచెందారు. కరీంనగర్ పాత బజారుకు చెందిన పెద్ది అంజన్న కుటుంబం మొత్తం 12మంది తిరుమలేశుని దర్శనార్థం ట్రాక్స్లో వెళుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై ఆగివున్న లారీని చూసుకోకుండా ట్రాక్స్ డ్రైవర్ అజాగ్రత్తగా నడపడం ప్రమాదానికి కారణమైంది. ఈ ప్రమాదంలో గాయపడిన ముగ్గురిని ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదస్థలిని ఎస్పీ నవీన్చంద్ పరిశీలించి బాధితులను పరామర్శించారు.












Click it and Unblock the Notifications