చిరంజీవిపై వైయస్ పరోక్ష వ్యాఖ్య

2003లో రైతులు విలవిలలాడినా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు. తాము రైతుల భూములకు సాగు నీరందించడానికి 17000 కోట్ల రూపాయలతో పోలవరం ప్రాజెక్టును ప్రారంభించామని, అయితే ప్రతిపక్షాలు దానికి అడ్డం పడ్డాయని, ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వం చేసే మంచి పనులకు ప్రతిపక్షాల నుంచి సహకారం ఉంటుందని, ఇక్కడి ప్రతిపక్షాలు మాత్రం అడుగడుగునా అడ్డం పడుతున్నాయని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు వామపక్షాలు, తెలంగాణ రాష్ట్ర సమితి అడ్డుపడ్డాయని, దాని వల్ల ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగిందని ఆయన అన్నారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని ఏ శక్తి కూడా అడ్డుకోలేదని ఆయన అన్నారు. తాము చేపట్టిన రెండు రూపాయల కిలో బియ్యం పథకం, రైతులకు ఉచిత విద్యుత్తు, ఆరోగ్య శ్రీ వంటి పథకాలను ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications