కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చేస్తోంది: కెసిఆర్

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంశం గురించి గతకొన్ని రోజులుగా ఢిల్లీ స్థాయిలో తీవ్రంగా ఆలోచిస్తోందని తెలిపారు. జాతీయస్థాయిలో రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలోని పరిస్థితులను బేరీజు వేసుకొని రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయరాదని భావిస్తోందన్నారు. రాష్ట్రంలో ఆ పార్టీతో కల్సి పనిచేసే అవకాశం ఇతర పార్టీలకు లేదని, తెరాస ఒక్కటే ప్రత్యామ్నాయంగా కనపడుతోందని పేర్కొన్నారు. తనతోపాటు పార్టీలోని మరికొందరు నాయకులతో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నట్లు వెల్లడించారు. తెలంగాణపై మరో పదిరోజుల్లో పూర్తిస్థాయిలో స్పష్టత వస్తుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు.
ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే తెరాసకు ఏడుశాతం అధికంగా ఓట్లు రావడం తదితర పరిణామాలు ఆ పార్టీ అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి కారణమన్నారు. ఇటు సూర్యుడు అటు ఉదయించినా ఇక తెలంగాణ ఏర్పడడం ఆగదని ఆయన అన్నారు. తెలంగాణ సంస్థ తెలంగాణ కోసం పోరాడకుండా రాజకీయం చేస్తోందని ఆయన నవ తెలంగాణ పార్టీని దుయ్యబట్టారు. ప్రరాపాలో కలవడంలేదని ఖండించడానికి కూడా ఆ పార్టీ వెనుకాడుతోందని విమర్శించారు.












Click it and Unblock the Notifications