మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం

విజయనగరం: ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు చెందిన ఓ భారీ పేలుడు పదార్థాల డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం జిల్లా ప్రత్యేక పోలీసు దళాలు టేకులోవ, బిత్రటొంకి గ్రామాల మధ్యలో మావోయిస్టులకోసం జరిపిన గాలింపుల్లో ఈ డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. 180 శక్తిమంతమైన గ్రెనేడ్లు, ఎలక్ట్రికల్‌ డిటనేటర్లు, ఎలక్ట్రికల్‌ వైర్లు లభ్యమయ్యాయి. ఈ డంప్‌ కోరాపుట్‌ మావోయిస్టులదిగా భావిస్తున్నారు. డంప్‌ స్వాధీనంతో పోలీసులు పెద్ద ముప్పు నుంచి బయటపడ్డట్లయింది. మావోయస్టులు బలమైన ఆయుధాలను కోల్పోయారని ఆ జిల్లా ఎస్పీ అన్నారు. ఇది మావోయిస్టులకు దెబ్బేనని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+