చిరంజీవి హీరో కాలేరు: వైయస్

ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గానీ, ఏప్రిల్ లో గానీ రావచ్చునని, అందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. రాజకీయ, సామాజిక కార్యకర్తలకు ప్రత్యేకత ఉండాలని, సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి తోడ్పడే గుణం ఉండాలని ఆయన అన్నారు. తమది ప్రత్యేక రాజకీయమని చిరంజీవి పదేపదే అంటున్నారని ప్రత్యేకం అంటే తొడగొట్టటమా అని ఆయన ప్రశ్నించారు. ప్రజలు తమ అభివృద్ధి చూసి తమకే ఓటు వేయటం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. కోటి రూపాయలతో నిర్మించిన మహిళా శిశు సంక్షేమ భవనాన్ని ఆయన ప్రారంభించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టును ఆయన జాతికి అంకితం చేశారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications