వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాధ వల్ల నష్టం లేదు: లగడపాటి

By Staff
|
Google Oneindia TeluguNews

విజయవాడ : కాంగ్రెస్‌ నుంచి ఎవరు వెళ్లినా పార్టీకి ఎటువంటి నష్టం వాటిల్లదని విజయవాడ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ ఆదివారంనాడు అభిప్రాయపడ్డారు. వంగవీటి రాధ ప్రజారాజ్యం చేరికపై ఆయన వ్యాఖ్యానిస్తూ నాయకుల వల్ల పార్టీకే ద్రోహం జరిగిందని పార్టీ మాత్రం ఎవరికీ ద్రోహం చేయలేదని ఆయన మీడియా ప్రతినిధులతో తెలిపారు. వంగవీటి రాధాకృష్ణ పార్టీ నుంచి వెళ్లిపోవడం వల్ల నష్టం లేదని ఆయన అన్నారు.

కాంగ్రెసు పార్టీ నుంచి గతంలో కూడా నాయకులు వెళ్లిపోయారని, కార్యకర్తలు వెళ్లిపోలేదని, నాయకులు వెళ్లినంత మాత్రాన నష్టం ఏమీ ఉండదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కూడా కాంగ్రెసు పార్టీలో ఉండి పదవులు పొంది ఆ తర్వాత వెళ్లిపోయారని, అయినా పార్టీకి ఏ విధమైన నష్టం జరగలేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X