వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామోజీకి శిక్ష తప్పదు: ఉండవల్లి

By Staff
|
Google Oneindia TeluguNews

Undavalli Arun Kumar
న్యూఢిల్లీ: నాగార్జున ఫైనాన్స్ లిమిటెడ్ లో డిపాజిటర్లను ముంచి తెచ్చిన డబ్బును "ఈనాడు" గ్రూపులో పెట్టుబడి పెట్టిన నిమేష్ కంపానీతో పాటు రామోజీరావుకు కూడా శిక్ష పడే రోజు వస్తుందని కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. " చట్టానికెవరూ అతీతులు కారు, శిక్ష పడడం కాస్త ఆలస్యమైతే కావచ్చు కానీ మోసాలు చేసిన వారు తప్పించుకోవడం అసాధ్యం" అని ఉండవల్లి చెప్పారు.

ఆర్ధిక సంబంధ కేసులు వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాయనున్నట్టు ఆయన చెప్పారు. ఇటువంటి కేసుల సత్వర పరిష్కారం కోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని తాను కోరనున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రజలను ముంచి, నేరం బయటపడితే కోర్టులను ఆశ్రయించి సంవత్సరాలు గడిపేయవచ్చనే వారికి భయం కలిగించడానికి "త్వరిత పరిష్కారం" ఉపయోగపడుతుందన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X