భూటాన్ పై ఐటీ బడా సంస్ధల కన్ను
థింఫు: భూటాన్ లో బిపివోలు, డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి ఇన్ఫోసిస్, జెన్ ప్యాక్, మైక్రోసాఫ్ట్ లు ఆసక్తి చూపిస్తున్నాయి. భూటాన్ లో పెట్టుబడి అవకాశాల పరిశీలనకు భారతదేశానికి చెందిన 30 ప్రముఖ ఐటీ కంపెనీలు ఇటీవల ఒక సమావేశం నిర్వహించాయి.
భూటాన్ లో డేటా సెంటర్స్ ఆపరేషన్, డిజాస్టర్ రికవరీ సెంటర్, బిపివోలు, సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ సెంటర్లు నెలకొల్పవచ్చని ఈ సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. "పెట్టుబడి పెట్టదగిన ఉత్తమ ప్రదేశంగా భూటాన్ కనిపిస్తోంది" అని ఇన్ఫోసిస్ బోర్డ్ చైర్మన్ ఎన్ ఆర్ నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు. భూటాన్ లోని గొప్పదనాన్ని గ్రహించడం ప్రారంభించిన తర్వాత మీ కళ్ళ ముందే అవకాశాలు కనిపిస్తాయని ఆయన అన్నారు.
భూటాన్ వంటి చిన్న దేశం ఐటి కేంద్ర బిందువుగా ఎలా మారగలదన్న ప్రశ్నను ఆయనే వేసి, దానికి జవాబును కూడా ఆయనే ఇచ్చారు. ఏడుగురితో ప్రారంభమైన ఇన్ఫోసిస్ కంపెనీ ఇప్పుడు ఐదు బిలియన్ డాలర్ల సంస్ధగా ఎదిగిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
"మా దీర్ఘ కాలిక ఐటీ వ్యూహాన్ని రూపొందించుకోవడంతో పాటు భారత్ తో భాగస్వాములు కాగలిగిన కొత్త దేశాలను సందర్శిస్తున్నాం. భూటాన్ కంపెనీలతో కలిసి పని చేయవచ్చు, లేదా ఐసిటి కంపెనీలను ఏర్పాటు చేయడంలో భూటాన్ కు సహకరించవచ్చు" అని నాస్కామ్ చైర్మన్ గణేష్ నటరాజన్ చెప్పారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications