వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోజా! నీ సంగతి తెలుసుకో: మహాలక్ష్మి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో సీటు వస్తుందో, రాదో కూడా తెలియని రోజా ఇంకొకరిపై విమర్శించేయడం సబబు కాదని పీఆర్పీ జిల్లా నాయకురాలు ఎన్‌వీ.మహాలక్ష్ష్మి అన్నారు. శనివారం విలేఖరులతో ఆమె మాట్లాడుతూ చిరంజీవిని విమర్శించే హక్కు రోజాకు లేదన్నారు. రంగులు పూసుకుని రాజకీయ్లాకి వచ్చింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు.

స్వచ్ఛందంగా పార్టీ పెట్టి పేదలకు సేవలందించేందుకు పీఆర్పీ ఆవిర్భంచిందన్నారు. మామను మోసగించి గద్దెనెక్కిన చంద్రబాబు చెంతచేరి చివరకు సీటు కూడా రాని పరిస్థితి రోజాదేనని, విమర్శించేముందు వెనుకాముందు చూసుకోవాలని దుయ్యబట్టారు. మరోసారి చిరంజీవిపై విమర్శలు గుప్పిస్తే తగిన రీతిలో బుద్ధిచెబుతామని ఆమె రోజాను హెచ్చరించారు. ఈ సమావేశంలో పీఆర్‌పీ అధికార ప్రతినిధి మునిసుబ్రమణ్యం, నిర్మలారామయ్య, ఇందుమతి, రవి, చౌదరి, రమణ తదితరులు పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X