పోరాటం ఆపకు..గద్దర్

Gaddar
హైదరాబాద్: 'తెలంగాణ ఉద్యమం కొస ముట్టేవరకూ పోరాడతానన్నావ్‌.. అదే మాటమీద ముందుకు సాగు.. నీకు పాటనై తోడుంటా' అని కేసీఆర్‌ను ఉద్దేశించి ప్రజాగాయకుడు గద్దర్‌ అన్నారు. తెలంగాణ ఇస్తావా ఇవ్వవా అని నిలదీస్తూ ఉద్యమం సాగాలన్నారు. తెలంగాణ విద్యార్థి గర్జనకు గద్దర్‌ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. సభాస్థలికి వచ్చినా.. వేదికపైకి ఎక్కడానికి ఆయన కొంతసేపు సంశయించారు. టీఆర్‌ఎస్‌ నేతల విజ్ఞప్తితో వేదికపై ఆశీనులయ్యారు. సభకు ప్రత్యేకాకర్షణగా మారిన గద్దర్‌ మాట్లాడటానికి ఉపక్రమించగానే.. ఈలలు, కేరింతలతో సభాస్థలి దద్దరిల్లింది. తనశైలికి భిన్నంగా ప్రసంగానికే పరిమితమయ్యారు.

'టీడీపీ, సీపీఐ, పీఆర్‌పీ... ఇలా అందరూ తెలంగాణకు జై అనడం వల్ల ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ తీవ్రత తగ్గే ప్రమాదం ఉందని ప్రజాగాయకుడు గద్దర్‌ అభిప్రాయపడ్డారు. ఇలాంటి సమయంలో కేసీఆర్‌ చరిత్రాత్మక పాత్ర పోషించి తెలంగాణ నిప్పురవ్వను ఆరకుండా చూసుకోవాలని విజ్ఞప్తిచేశారు. తుది వరకు పోరాడాలని.. దానికి తాను పాటగా, బాసటగా నిలుస్తానని భరోసా ఇచ్చారు.

అలాగే శాంతి చర్చలకు తాను తీసుకొచ్చిన 85 మంది నక్సల్స్‌లో ఐదుగురు మాత్రమే మిగిలారని, 80 మందిని కాల్చిచంపేశారని మండిపడ్డారు. తెలంగాణ ఇస్తానని ఇవ్వకుండా మరో మోసం చేసిందని దుయ్యబట్టారు. 'మా భూములు, నీళ్లు, ఉద్యోగాలు, వనరులు, స్వాభిమానం, మా తెలంగాణ మాకు కావాలని ఉద్యమించాలి. తెలంగాణ కావాలో వద్దో తల్లిదండ్రుల కాళ్లు పట్టుకుని ప్రశ్నించండి' అని విద్యార్థులను కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరవీరులకు జోహార్లు చెబుతూ గద్దర్‌ పాట పాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+