హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెడ నరుక్కుంటా గాని..కేసీఆర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: 'మన దుఃఖాలను దూరంచేసేది బూటకపు వాగ్దానాలు కావు.. తెలంగాణ రాష్ట్ర సాధనే. చిచ్చురపిడుగుల్లా విజృంభించండి, గ్రామ గ్రామాన ఉద్యమ చైతన్యాన్ని రగిలించండి' ప్రత్యేక రాష్ట్రం రావాలంటే కాంగ్రెస్‌ పోవలసిందేనని తెరాస అధినేత కేసీఆర్‌ స్పష్టంచేశారు. సోమవారమిక్కడ నిజాం కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన తెలంగాణ విద్యార్థి గర్జన సభకు విద్యార్థులు భారీఎత్తున హాజరయ్యారు. వారినుద్దేశించి కేసీఆర్‌ ప్రసంగించారు.అని విద్యార్థులకు పిలుపిచ్చారు. వారందించిన కత్తి చేతబట్టి ప్రతిన చేశారు.'మీరిచ్చిన కత్తిమీద ఆన చేసి చెబుతున్నా.. మెడనరుక్కుంటా గాని తలదించను. బుల్లెట్ల వాన కురిసినా వెనకడుగు వేసేదిలేదు' అని పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమాన్ని మింగేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ కుట్ర పన్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం విద్యార్థులదేనని, వారే కథానాయకులని, అందరినీ ఏకం చేసే బాధ్యత వారిదేనని ఉద్ఘాటించారు. 2004 ఎన్నికల్లో వెంట ఉండి కాంగ్రెస్‌ను గెలిపించామని, ఈ సారి వెంటబడి ఓడించాలని పిలుపిచ్చారు. కొందరు తెరాస ఎమ్మెల్యేలను సన్నాసుల్ని చేసి ఉద్యమాన్ని మింగేందుకు ప్రయత్నం చేశారు. ఉద్యమాన్ని మింగడమే వైఎస్‌ లక్ష్యం. తెలంగాణ ఇస్తామన్న భాజపా, తెలంగాణకు అనుకూలమన్న తెదేపా, సీపీఐ, ప్రజారాజ్యం పార్టీలను కూడా మింగుతారా? అలా మింగితే ఢామ్మని పేలిపోతారు.

వైఎస్‌లాంటి సీఎంలను చాలామందిని చూశాం. జబ్బలు చరిచినవారిని 2004లో ఎన్నికల్లో బండకేసి కొడితే ఇప్పటికీ లేవలేదు. తెలంగాణపై వైఎస్‌ ఒక మాట, డీఎస్‌ ఒక మాట. గల్లీలో ఒక మాట.. ఢిల్లీలో ఒక మాట మాట్లాడి ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు' అని దుయ్యబట్టారు. గోల్‌మాల్‌ చేసినవాడిని గోరీకట్టే తెలంగాణ ఇప్పుడుందని, పది కిలోమీటర్ల లోతున పాతరేసి పాతిపెడతారని హెచ్చరించారు. ఓట్ల బడ్జెట్‌ ప్రభుత్వం.. వచ్చే ఎన్నికల్లో రూ.6 వేల కోట్లు ఖర్చుపెట్టడానికి సిద్ధమైందన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X