హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ పై కోర్టుకు వెళ్లొచ్చు:చిరంజీవి

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: కాంగ్రెస్‌ నేతలు పవన్‌ వ్యాఖ్యలతో తమ పరువు పోయిందని భావిస్తే కోర్టుకు వెళ్లి తేల్చుకోవచ్చునని చిరంజీవి సూచించారు. ఆయన పవన్‌ వ్యాఖ్యలను సమర్థిస్తూ.. 'యువకుడిగా తనదైన శైలిలో పవన్‌ స్పందించారు. పవన్‌ భావం, ఆవేశంపై పార్టీలో భిన్నాభిప్రాయం లేదు. ఆ వ్యాఖ్యలు ఇంకా ఉత్సాహాన్ని ఇచ్చాయి' అన్నారు.

కాంగ్రెస్‌ నేతలు కూడా రక్తవ్యాపారి అంటూ తనపై వ్యక్తిగత విమర్శలు చేశారని.. తామేమీ వారిపై దాడికి వెళ్లలేదన్నారు. పార్టీలోని మిగిలిన నేతలూ పనిగట్టుకుని పవన్‌కల్యాణ్‌లా మాట్లాడాలని తాను చెప్పబోనని.. అందుకు స్ట్రిప్టు ఇవ్వబోనని, ఎవరి శైలి వారికి ఉంటుందని తెలిపారు.

ప్రభుత్వ వ్యతిరేక చర్యలను ఎవరికి తోచిన విధంగా వారు ప్రజల మనసులో నాటుకునే విధంగా చెప్పవచ్చునని తెలిపారు. 'బీజేపీతో కలిసే ఆలోచనే లేదు. అలా కలవాలని మీరే కోరుకుంటున్నారు' అని మీడియానుద్దేశించి వ్యాఖ్యానించారు. నిజాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదని కాంగ్రెస్‌ నేత గోనె ప్రకాశరావుకు హితవు పలికారు. ఇక జీవిత వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరిస్తూ.. ఆమె చాలా చిన్నదన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X