వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అభివృధ్ధి ఎవరు చేసారు? వైఎస్
అలాగే గోదావరి జిల్లాల డ్వాక్రా మహిళల క్రమశిక్షణ దేశానికే ఆదర్శమని ఆయన అన్నారు. రాష్ట్రంలో డ్వాక్రామహిళలకు ఈ ఒక్క ఏడాదిలోనే పదకొండు వేల ఐదువందల కోట్లరూపాయలను రుణంగా పంపిణీ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. గోదావరి జిల్లాల డ్రాక్రామహిళల క్రమశిక్షణ దేశానికే ఆదర్శమన్నారు. ప్రతి పేద ఇంటి పిల్లలు ఇంజనీరింగ్, వైద్య చదువులు చదివేందుకు వీలుగా ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తుందని తెలిపారు. పావలా వడ్డీ రుణాలతో మహిళలు ఆర్థికంగా అభివృద్ది చెందుతున్నారని ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ గత నాలుగున్నర సంవత్సరాలుగా చేసిన,చేస్తున్న అభివృద్ధిని ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయలేదని ఆయన అన్నారు.ఆయన శనివారం తూర్పుగోదావరి జిల్లాలో ద్వారపూడిలో సుమారు రూ.33 కోట్లతో నిర్మించే ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం వైఎస్ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.
Comments
Story first published: Saturday, January 3, 2009, 15:12 [IST]