వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెర్రరిజంపై కలిసి పోరాడుదాం:ప్రధాని

By Staff
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
చెన్నై: ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాదం పెద్ద సమస్యగా మారిందని, దీని అంతానికి ఇతర ప్రపంచ దేశాలతో కలిసి పనిచేస్తామని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. చెన్నైలో మూడు రోజులపాటు జరిగే ఏడవ 'ప్రవాసీ భారతీయ దివస్‌' వేడుకలకు గురువారం ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి పలు దేశాల నుంచి సుమారు 1500 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

చెన్నైలో ఈరోజు నుంచి జరుగుతున్న ప్రవాసభారతీయ దివస్‌ను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. దేశ ఆర్థికాభివృద్ధిలో ప్రవాస భారతీయుల పాత్రను ఆయన కొనియాడారు. అలాగే ఇప్పటికే ఉగ్రవాద నిర్మూలనకు కొన్ని దేశాలు మద్దతివ్వగా కెనడా కూడా మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. అలాగే గాజాపై ఇజ్రాయిల్‌ దాడిని ఖండించిన ప్రధాని పాలస్తీనియన్లకు సంఘీభావం ప్రకటించారు. ఈ సమావేశంలో రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌కూడా పాల్గొన్నారు.

ఇదిలాఉండగా ప్రవాసీ భారతీయ దివస్‌పై లష్కరే, ముజాహిదీన్లు దృష్టి పెట్టారని ఇంటిలిజెన్స్ వర్గాలు ద్వారా తెలియటంతో చెన్నైలో రెడ్‌ ఎలర్ట్‌ ప్రకటించారు. తీవ్రవాదుల బెదిరింపు మెయిల్స్‌ రావడంతో ముంబాయి దాడుల దరిమిలా ప్రవాస భారతీయ దినోత్సవాలకు భారీభద్రత కల్పించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X