వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లారీల సమ్మె: సైన్యం సహాయం
న్యూఢిల్లీ: లారీలు, చమురు కంపెనీల ఉద్యోగుల సమ్మెతో దేశవ్యాప్తంగా సంక్షోభం నెలకొనటంతో కేంద్రం ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది. ఈరోజు ఉదయం క్యాబినెట్ సెక్రటరీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఐఓసీ ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. ఇందులో మంత్రి మురళీదేవ్రాతో చమురు కంపెనీల చర్చలు విఫలమైన నేపథ్యంలో తీసుకోవలసిన చర్చలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా చమురు కంపెనీల ట్యాంకర్ల నుంచి చమురును తరలించేందుకు సైన్యం సాయం తీసుకోవాలని నిర్ణయించారు.
Story first published: Friday, January 9, 2009, 14:31 [IST]