తెలుగు మహాసభలు ప్రారంభం
విజయవాడ: ప్రపంచ తెలుగు ద్వైవార్షిక మహాసభలు శుక్రవారం విజయవాడలో ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి రోశయ్య ఈ కార్యక్రమంలో ప్రారంభోపన్యాసం చేశారు. తెలుగు భాషాభివృద్ధికి, సంస్కృతి వికాసానికి ప్రపంచ తెలుగు సమాఖ్య నిర్వహిస్తున్న ఇలాంటి సదస్సులు దోహదం చేస్తాయని రోశయ్య అభిప్రాయపడ్డారు.
ఇంకా ఈ ఎనిమిదవ ప్రపంచ తెలుగు ద్వైవార్షిక మహాసభలకై దేశవిదేశాల నుంచి కూడా పలు వురు ప్రవాస ప్రతినిధులు పాల్గొన్నారు. స్థానిక కాంగ్రెస్ నేతలైన లగడపాటితో పాటు పలువురు అధికారులు, రచయితలు, కళాకారులు కూడా ఈ మహాసభలకు పెద్ద ఎత్తున హాజరయ్యా రు. మూడు రోజుల పాటు ఈ తెలుగు మహాసభలు నిర్వహించబడతాయి.












Click it and Unblock the Notifications