వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సత్యం కేసు ప్రధానమంత్రి దృష్టికి

By Staff
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
న్యూఢిల్లీ: సత్యం కంపెనీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో ఈరోజు హోంమంత్రి చిదంబరం, ప్రణాళికా సంఘం అధ్యక్షుడు మాంటెక్‌సింగ్‌ అహ్లువాలియా ప్రధానిని కలవనున్నారు. సత్యం పరిణామాలు, దీనిపై తాము తీసుకున్న చర్యల గురించి వారు ప్రధానికి వివరించనున్నారు.

వారంలోగా కొత్త బోర్డు
మరో వారం రోజుల్లో సత్యం కంపెనీకి కొత్త బోర్డును నియమిస్తామని శనివారం కేంద్ర కంపెనీ వ్యవహారాల మంత్రి గుప్తా స్పష్టం చేశారు. ఈ మేరకు లా బోర్డు అనుమతి పొందామని, సత్యం కంపెనీ కొత్త బోర్డులో పారదర్శక విధానం పాటిస్తామని ఆయ న చెప్పారు. దీనితో సత్యం కంపెనీ వర్గాల్లో ఆందోళన అధికమయింది.

లోగుట్టును కప్పిపుచ్చి, కంపెనీని పునర్వ్యవస్థీకరించాలని నూతన సిఈఒ సారధ్యంలోని సంక్షోభ నివారణ బృందం తీవ్ర ప్రయత్నాలు మొదలెట్టింది. అయితే వీరి వ్యవహార శైలిపై పలు అనుమానాలు వ్యక్తం కావడం, ఉద్యోగుల భవిష్యత్‌ దృష్ట్యా కంపెనీని తమ చేతుల్లోకి తీసుకో వాలని నిర్ణయించిన్నట్లు కంపెనీ వ్యవహారాల మంత్రి గుప్తా వివరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X