Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రతీ గడపకూ 'ప్రజారాజ్యం'

Chiranjeevi
హైదరాబాద్: 'గడప గడపకు ప్రజారాజ్యం' అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ శ్రేణులకు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పిలుపు నిచ్చారు. హైదరాబాద్‌లోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో మంగళవారం పీఆర్పీ హైదరాబాద్‌, రంగారెడ్డి, సికింద్రాబాద్‌, విశాఖ, చిత్తూరు, ప్రకాశం జిల్లా కమిటీల సమావేశంలో చిరంజీవి ప్రసంగించారు. ప్రజలు మన వెంటే ఉన్నారు.. విజయం మనదే.. వారి మనసులను గెలవండని ఆయన కార్యకర్తలను కోరారు.

నిద్రాహారాలు పక్కనబెట్టి పనిచేయండి. ఇంత గొప్ప అవకాశం ఇంకెప్పుడూ రాదు. ప్రతి ఇంట్లో ప్రజారాజ్యం మాట తప్ప మరేదీ వినిపించకూడదు. ప్రజల్లో నిశ్శబ్ద విప్లవముంది. గమనించండి. అయోమయ పరిస్థితి వద్దు'.. అంటూ ఆయన పార్టీ శ్రేణులకు ఉద్భోదించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది కేవలం కాగితాలకే పరిమితం అయ్యాయని ఆయన విమర్శించారు. సత్యం, మేటాస్‌లలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఎంత పాత్ర ఉందో అందరికీ తెలుసని ఆయన ఆరోపించారు.

ఏదీ ఉచితంగా ఇవ్వకూడదు అని ఒకప్పుడు చెప్పిన బాబు.. నేడు అన్ని ఉచితం అంటున్నారు. ఆయన హామీలకు అమెరికా బడ్జెట్‌ కూడా చాలదేమో!'' అని ఎద్దేవా చేశారు. "చిరంజీవి ఉన్నాడు. గెలిచేస్తాం!'' అని అనుకోవద్దని శ్రేణులను హెచ్చరించారు.

ఇక పదవుల్లేవనే అసంతృప్తి అక్కడక్కడా ఉంది. దీనిపై కొందరు మారాం చేస్తున్నారు. వీరు మనస్ఫూర్తిగా గొడవ చేస్తున్నారని అనుకోను. నాకు పార్టీ ఏమిచ్చింది అనుకోకుండా నేను పార్టీకి ఏమిటి? ఎలా సాయపడగలనని ప్రశ్నించుకోవాలి'' అంటూ సూచించారు. రూ.వందకు వంటింటి సరుకులు ప్రజాకర్షక పథకం కాదని, ప్రజా అవసర పథకమని పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+