'అభయ హస్తం' ఆరంభం
హైదరాబాద్: ఇక నుంచి అరవై ఏళ్ళు దాటిన ప్రతీ డ్వాక్రా మహిళకు ప్రతి నెలా ఐదు వందల రూపాయల పించన్ అందనుంది. ఆ సౌకర్యం కల్పించే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం అనే కొత్త పథకం ను ప్రారంభించింది. ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పథకాన్ని ఈ మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో ప్రారంభించారు. అన్ని జిల్లాలోను ఈ పథకాన్ని ఈ నెల 7,8 తేదిల్లో ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. 60 ఏళ్ల పైబడిన డ్వాక్రా సభ్యులకు ప్రతి నెలా రూ. 500ల పెన్షన్ ఇస్తారు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కోటి 25 లక్షల మంది మహిళలు లబ్ధిపొందనున్నారు. ఈ పింఛన్ తో పాటే..జీవిత బీమా, పిల్లలకు ఉపకార వేతనాలు లభించనున్నాయి.
Comments
Story first published: Friday, February 6, 2009, 13:41 [IST]