వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కల్లు తాగి కోతిలా..రోజా

By Staff
|
Google Oneindia TeluguNews

Roja
తిరుపతి: ఓ ప్రక్క చిరంజీవి మధ్యపాన నిషేధమంటూంటే ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ కల్లు తాగి కోతిలా గెంతుతున్నాడని తెలుగు మహిళ రోజా మరో సారి ప్రజారాజ్యం పై విరుచుకు పడ్డారు. అలాగే చిరంజీవికి ఏ విషయంలోనూ స్పష్టత లేదని, సమస్యలపై అవగాహన లేదని ఆమె విమర్శించారు. అంతేగాక రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉంటాయో, ఎంతమంది ఎమ్మల్యేలు, ఎంపీలు ఉంటారో తెలియదని ఆమె ఎద్దేవా చేసారు. ఇక పొత్తులు కావాలంటారు, వద్దందారు..వీళ్ళు ప్రజలకు న్యాయం ఏం చేస్తారో చెప్పండని ఆమె అన్నారు.

చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రోజా ప్రజారాజ్యాన్ని, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను దుయ్యబట్టారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి గాలిలోకి ముద్దులు విసురుతూ మహిళలను అవమానిస్తున్నారని తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు రోజా ఆరోపించారు. ఇక ఈ రోజు నుండి ప్రారంభం అవుతున్న అభయహస్తం పధకాన్ని విమర్శిస్తూ..కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇస్తున్నది అభయహస్తం కాదు భస్మాసురహస్తమని ఆమె విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X