రైలు ప్రమాదంలో 18 మంది మరణం
కటక్: హౌరా నుంచి చెన్నై వెళుతున్న కోరమాండల్ ఎక్స్ప్రెస్(2841 అప్) శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో ఒరిస్సాలోని జాజ్పూర్ రోడ్డు రైల్వేస్టేషన్ వద్ద ఘోర ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో 18 మంది మృతిచెందారు. 100 మందికి పైగా గాయపడ్డారు. అయితే మృతులు 15 మందేనని, 50-60 మంది దాకా గాయపడ్డారని రైల్వేమంత్రి లాలు ప్రసాద్ ఢిల్లీలో ప్రకటించారు. ప్రమాదంలో రైలు డ్రైవరు, అసిస్టెంట్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారని ఆయన తెలిపారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నందువల్ల మృతుల సంఖ్య మరింత పెరగవచ్చునని సమాచారం. గాయపడిన వారిని కటక్ ఎస్సీబీ ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఎస్ఎల్ఆర్-1, జనరల్ బోగీలు-2, స్లీపర్ బోగీలు-11, ప్యాంట్రీకార్-1 కలిపి మొత్తం 15 బోగీలు పట్టాలు తప్పినట్లు ఖుర్దారోడ్ సహాయ కేంద్రానికి సమాచారం అందింది. ప్రమాద ప్రాంతంలో ఎగువ, దిగువ మార్గాల్లో రైళ్ల రాకపోకలు స్తంభించాయి. రైలు జాజ్పూర్ స్టేషన్ దాటిన తరువాత ఔటర్లో పట్టాలు తప్పింది. ఆ సమయంలో రైలు 60 నుంచి 70 కి.మీ. వేగంతో ప్రయాణిస్తోంది. రైలు వేగంగా వెళుతున్నందువల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని ఓ ప్రత్యక్షసాక్షి తెలిపారు. జాజ్పూర్లో ఈ రైలు ఆగదు. దుర్ఘటనపై లాలు విచారణకు ఆదేశించారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications