హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ నిద్రపోతారా: మందకృష్ణ

By Staff
|
Google Oneindia TeluguNews

Mandakrishna Madiga
హైదరాబాద్‌: తాను సంతృప్తిగా నిద్రలేస్తున్నానని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అనడాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) నేత మందకృష్ణ మాదిగ తప్పు పట్టారు. ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను కూడా అమలు చేశామని, దాంతో తాను సంతృప్తిగా నిద్ర లేస్తున్నానని ముఖ్యమంత్రి అనడం హాస్యాస్పదమని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.

ఇవే ఆఖరి పార్లమెంటు సమావేశాలు కాబట్టి వైయస్ తన హామీని నిలుపుకోవాలంటే ఈ సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లు పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తేవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. వర్గీకరణ బిల్లు కోసం డిమాండ్ చేస్తూ గురువారం నుంచి ఈ నెల 26వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. తమ డిమాండ్ పరిష్కారానికి రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని ఆయన హెచ్చరించారు. చావో బతుకో తేల్చుకునేలా ఉద్యమం చేపట్టాలని ఆయన ఎమ్మార్పీయస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X