వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరు, అరవింద్ ల భేటీ టెన్షన్

By Staff
|
Google Oneindia TeluguNews

Allu Aravind
కర్నూలు: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పర్యటనలో ఉన్న ప్రజారాజ్యం అధినేత చిరంజీవిని ఆయన బావ మరిది అల్లు అరవింద్ ఆఘమేఘాల మీద కలుసుకున్న సంఘటనతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఆళ్లగడ్డ పర్యటనలో ఉన్న చిరంజీవిని కలుసుకోవడానికి అల్లు అరవింద్ ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి వెళ్లారు. నవ తెలంగాణ పార్టీ నాయకుడు టి.దేవేందర్ గౌడ్ భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో పొత్తు ప్రయత్నిస్తుండడం చిరంజీవిని కలవర పెట్టినట్లు భావిస్తున్నారు.

బిజెపి అగ్రనేత చిరంజీవిని కలుసుకోవడానికి దేవేందర్ ఢిల్లీ వెళ్లారు. దీంతో ఉన్న ఒక్క మిత్ర పక్షం కూడా చేజారిపోయే పరిస్థితి వచ్చిందని ఆందోళన చెందిన చిరంజీవి అల్లు అరవింద్ ను అఘమేఘాల మీద కర్నూలు జిల్లాకు పిలిపించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అల్లు అరవింద్ భేటీకి ప్రత్యేక కారణాలేమీ లేవని చిరంజీవి అన్నారు. తాము బిజెపితో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X