వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ అస్తులపై భేటీల సందడి

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల అక్రమాలపై కేంద్రం విచారణ జరిపించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నేతృత్వంలో మహాకూటమి నేతలు కేంద్ర మంత్రి ప్రణబ్‌ ముఖర్జీని ఢిల్లీలో కలిశారు. ముఖ్యమంత్రి ఆర్థిక నేరాలపై వారు ప్రణబ్‌కు వివరించారు. భారతదేశ చరిత్రలో ఇది అతిపెద్ద కుంభకోణమని చెబుతూ తక్షణం దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరినట్లు వారు తెలిపారు. ఈ వివరాలను రెగ్యులేటరీ అథారిటీకి పంపిస్తామని ప్రణబ్‌ హామీ ఇచ్చినట్లు చంద్రబాబు వెల్లడించారు.

అంతకుముందు మహా కూటమి నేతలు భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేత అద్వానీని కలిసిన వైఎస్‌ అక్రమాలపై వివరించారు. మరోవైపు వైఎస్‌, సాక్షి పత్రిక అక్రమాలపై కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ రేపు జంతర్‌మంతర్‌వద్ద ధర్నా చేపడతామని మహాకూటమి నేతలు తెలిపారు. ప్రణబ్‌, అద్వానీలను కలిసినవారిలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖరరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ తదితరులు ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X