వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లక్ష కోట్ల అస్తి అంటారు: వైయస్

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
వరంగల్: తన కుటుంబానికి లక్ష కోట్ల రూపాయల ఆస్తులున్నాయని కూడా మహాకూటమి నేతలు ప్రచారం చేయగలరని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయ లబ్ధి కోసమే తన కుటుంబ ఆస్తులపై మహా కూటమి నేతలు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. వరంగల్ జిల్లాలో ఆయన గురువారం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తాము చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులతో తెలుగుదేశం పార్టీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. తన కుటుంబం ఆస్తులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి తెలంగాణపై చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. తెలంగాణకు వ్యతిరేకులైనవారితో జత కట్ట తెలంగాణ ఎలా సాధిస్తారని ఆయన తెరాసను ప్రశ్నించారు.

ముఖ్యమంత్రికి ముందే స్థానిక తెలుగుదేశం శాసనసభ్యుడు కడియం శ్రీహరి ధర్మసాగర్ వద్ద దేవాదుల నీటిని విడుదల చేశారు. దాంతో తెలుగుదేశం నాయకులపై పోలీసులు కేసు పెట్టారు. స్థానిక శాసనసభ్యుడి హోదాలోనే తాను నీరు విడుదల చేశానని శ్రీహరి చెప్పారు. తాము ప్రాజెక్టులు కడితే తెలుగుదేశం వారు నీరు విడుదల చేస్తారా అని ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఆ సంఘటనను ఉద్దేశించి అన్నారు. తెలుగుదేశంవారు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. తాము నిర్మించిన సాగు నీటి ప్రాజెక్టులకు తెలుగుదేశం పార్టీ కుళ్లుకుంటోందని ఆయన అన్నారు.

తాము ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేశామని ఆయన చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే రెండు రూపాయలకు కిలో బియ్యం ఇవ్వగలరా, పింఛన్లు ఇవ్వగలరా, ఆరోగ్య శ్రీ ద్వారా పేదలకు వైద్య సౌకర్యం అందించగలరా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు వ్యతిరేకమైన సిపిఎంతో తెరాస ఎలా జత కడుతుందని ఆయన అడిగారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X